మా పార్టీని విలీనం చేయాలని బీజేపోళ్లు బెదిరించారు... లేదంటే కవితపై కేసు పెడ్తమన్నరు: శ్రీనివాస్ గౌడ్

మా పార్టీని విలీనం చేయాలని బీజేపోళ్లు బెదిరించారు... లేదంటే కవితపై కేసు పెడ్తమన్నరు: శ్రీనివాస్ గౌడ్
  • కేసీఆర్ ఒప్పుకోకపోవడంతోనే కవితపై కేసు పెట్టారు   
  • ఆమెను నానా కష్టాలకు గురిచేశారు 
  • బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఎప్పటికీ ఉండదని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ను బీజేపీలో విలీనం చేయాలని ఆ పార్టీ నేతలు బెదిరించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ లీడర్ శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ‘‘లిక్కర్​స్కామ్​ పేరు చెప్పి బీజేపీలో బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ను విలీనం చేయాలని ఆ పార్టీ నేతలు బెదిరించారు. అయినప్పటికీ తన ప్రాణం ఉన్నంత వరకు పార్టీని విలీనం చేయనని బీఆర్​ఎస్​ చీఫ్​ కేసీఆర్ స్పష్టంగా ​చెప్పడంతో ఆయన కూతురు కవితపై కేసు పెట్టారు. బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ను విలీనం చేయలేదని కేసీఆర్​ బిడ్డను బీజేపీ నానా కష్టాలు పెట్టింది. 

కాబట్టి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఎట్టిపరిస్థి తుల్లోనూ ఉండదు” అని ఆయన అన్నారు. బీఆర్ఎస్​ఒంటరిగానే పోరాడుతుందని, అధికారం లోకీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కవిత ను కావాలనే లిక్కర్ స్కామ్‌‌‌‌‌‌‌‌లో ఇరికించారని ఆరోపించారు. అమెరికా పర్యటనలో ఉన్న శ్రీనివాస్ గౌడ్.. శనివారం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్​ ఇంట్లో పంచాయితీలేమీ లేవని ఆయన చెప్పారు. ఇల్లన్నంక చిన్న చిన్న గొడవలు ఉంటాయని, అవన్నీ సర్దుకుంటాయని తెలిపారు. దాని వల్ల పార్టీకేమీ నష్టం జరగదని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.