
- కేసీఆర్ ఒప్పుకోకపోవడంతోనే కవితపై కేసు పెట్టారు
- ఆమెను నానా కష్టాలకు గురిచేశారు
- బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఎప్పటికీ ఉండదని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలని ఆ పార్టీ నేతలు బెదిరించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ లీడర్ శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ‘‘లిక్కర్స్కామ్ పేరు చెప్పి బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయాలని ఆ పార్టీ నేతలు బెదిరించారు. అయినప్పటికీ తన ప్రాణం ఉన్నంత వరకు పార్టీని విలీనం చేయనని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ స్పష్టంగా చెప్పడంతో ఆయన కూతురు కవితపై కేసు పెట్టారు. బీఆర్ఎస్ను విలీనం చేయలేదని కేసీఆర్ బిడ్డను బీజేపీ నానా కష్టాలు పెట్టింది.
కాబట్టి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఎట్టిపరిస్థి తుల్లోనూ ఉండదు” అని ఆయన అన్నారు. బీఆర్ఎస్ఒంటరిగానే పోరాడుతుందని, అధికారం లోకీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కవిత ను కావాలనే లిక్కర్ స్కామ్లో ఇరికించారని ఆరోపించారు. అమెరికా పర్యటనలో ఉన్న శ్రీనివాస్ గౌడ్.. శనివారం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఇంట్లో పంచాయితీలేమీ లేవని ఆయన చెప్పారు. ఇల్లన్నంక చిన్న చిన్న గొడవలు ఉంటాయని, అవన్నీ సర్దుకుంటాయని తెలిపారు. దాని వల్ల పార్టీకేమీ నష్టం జరగదని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.