SSRMB29: అడవిలో అడుగుపెట్టబోతున్న జక్కన్న..ఇండియన్ స్క్రీన్ దద్దరిల్లాల్సిందే!

SSRMB29: అడవిలో అడుగుపెట్టబోతున్న జక్కన్న..ఇండియన్ స్క్రీన్ దద్దరిల్లాల్సిందే!

ప్రస్తుతం ఇండియా నుండి వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ హైపుడ్ మూవీ ఏదైనా ఉందంటే అది మహేష్(Mahesh babu), రాజమౌళి(Rajamoulli) కాంబోలో వస్తున్న మూవీ (SSMB29) అని చెప్పాలి. టాలీవుడ్ సినీ చరిత్రలో అపజయం లేని డైరెక్టర్ గా చెరగని ముద్ర వేశారు దర్శక ధీరుడు రాజమౌళి. అలాగే ప్రతి ఒక్కరి కలల రాజకుమారుడిగా గుర్తింపు పొందారు మహేష్ బాబు. దీంతో వీరిద్దరి ప్రాజెక్ట్ పై చిన్న న్యూస్ తెలిసిన చాలు..అది మాకు ఎంతో సంతోషం అంటూ సినీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక నిన్న ఆగస్ట్ 9న మహేష్ పుట్టినరోజు స్పెషల్గా SSMB29 నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని ఫ్యాన్స్ ఎదురుచూసారు. కానీ, ఎలాంటి అప్డేట్ రాకపోయేసరికి పూర్తిగా డిస్సపాయింట్ అయ్యారు. అయితే, ఈ సినిమా నుంచి అదిరిపోయే న్యూస్ మాత్రం బయటికి వచ్చింది. 

ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి, మహేష్ సినిమా కోసం తన టీమ్ తో కలిసి సౌతాఫ్రికా వెళ్లనున్నారు. ఇది ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అడ్వెంచర్ యాక్షన్ మూవీ కావడంతో, ఎక్కువ భాగం అడవుల్లోనే షూటింగ్ ప్లాన్ చేసేలా పక్క ప్రణాళికతో రెడీ అయ్యారు. ఇందుకోసం దక్షిణాఫ్రికాలో కొన్ని దట్టమైన అడవుల్లో జక్కన్న తన బృందంతో కలిసి రెక్కీ నిర్వహించనున్నారు.

మునుపెన్నడు చూడని విధంగా ఇండియన్ స్క్రీన్ పై  అదిరిపోయే లొకేషన్స్ లో ఈ సినిమాని షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే, ఈ సినిమా ఎక్కువభాగం రియల్ లొకేషన్స్ లో మాత్రమే ఉంటుంది. ఇదివరకైతే మహేష్ 'అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు, రామోజీ ఫిలింసిటీ, బయట సెట్స్ లోనే ఎక్కువ భాగం పాల్గొనేవాడు. ఇక ఇప్పుడు అడవుల్లో అడుగుపెట్టబోతున్నాడు. ఈ సినిమా ఆగస్ట్ ఎండింగ్ లో లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో  ప్రారంభిస్తామని నిర్మాత కె.ఎల్‌. నారాయణ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మరి మహేష్ సెట్ లో అడుగు పెట్టడానికి టైం పట్టొచ్చు అని సమాచారం. 

హై-వోల్టేజ్ యాక్షన్‌ అండ్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ నటించనుందని తెలుస్తోంది. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తుండగా..కీరవాణి మ్యూజిక్ సమకూరుస్తున్నారు.