ఫస్ట్ నుంచి  టెన్త్ మెమోలు

ఫస్ట్ నుంచి  టెన్త్ మెమోలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2020–21 అకడమిక్ ఇయర్​లో టెన్త్ పూర్తి చేసిన స్టూడెంట్లకు వారంలో లాంగ్ ​మెమోలు అందనున్నాయి. వచ్చే నెల ఒకటి నుంచి స్కూళ్లు రీఓపెన్ కానుండటంతో, ఆ రోజు నుంచే మెమోలు పంపేందుకు పరీక్షల విభాగం అధికారులు కసరత్తు చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్​తో మే 17 నుంచి 26 వరకు జరగాల్సిన టెన్త్ ఎగ్జామ్స్​ను ప్రభుత్వం రద్దు చేయగా ఎఫ్ఏ 1 మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయించింది.దీంతో 5.21 లక్షల మంది పాసయ్యారు. వచ్చే నెల ఫస్ట్ నుంచి స్కూళ్లకు లాంగ్ మెమోలు పంపిస్తామని పరీక్షల విభాగం డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి చెప్పారు.