ఐదారు వేలతో ఎట్ల బతకాలె

ఐదారు వేలతో ఎట్ల బతకాలె

హైదరాబాద్ వెలుగు : ఎంపీ, ఎమ్మెల్యేలు లక్షల్లో జీతాలు తీసుకుంటూ  తమకు ఐదారు వేలు మాత్రమే ఇస్తున్నారని, కుటుంబాలతో ఎట్ల బతకాలని తెలంగాణ మోడల్ స్కూల్స్ హాస్టళ్ల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.  కనీస వేతనాలు ఇవ్వలంటూ శనివారం ఇందిరా పార్కు వద్ద ధర్నా చేశారు.  మోడల్​స్కూల్ హాస్టల్​ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్​ యూనియన్(సీఐటీయూ) ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్​మాట్లాడుతూ హాస్టల్స్​ సిబ్బందికి  నెలలుగా జీతాలు సరిగా ఇవ్వడం లేదని, రాష్ట్ర  ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నం. 60  ప్రకారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ హాస్టల్స్​లోని సిబ్బందికి ఇస్తున్నట్లు తమకు ఎందుకివ్వరని ప్రశ్నించారు. జిల్లాల్లో  బకాయిలను వెంటనే చెల్లించాలని,  లేదంటే రాష్ట్రవ్యాప్త  ధర్నాకు దిగుతామని ఆయన హెచ్చరించారు. ఈ ధర్నాలో వివిధ జిల్లాల నుంచి హాస్టల్స్​ సిబ్బంది  భారీగా  తరలివచ్చారు.