గాంధీ హాస్పిటల్‌ లో ఇంటి దొంగలు..పేషెంట్ల నగలు, ఫోన్లు మాయం

గాంధీ హాస్పిటల్‌ లో ఇంటి దొంగలు..పేషెంట్ల నగలు, ఫోన్లు మాయం
  • కరోనా పేషెంట్ల నగలు, ఫోన్లు మాయం చేస్తున్న సిబ్బంది

పద్మారావునగర్ , వెలుగు: గాంధీ ఆసుపత్రిలో ఇంటి దొంగల చేతివాటం వెలుగు చూసింది. కరోనా సోకి ఇబ్బందుల్లో ఉన్నపేషెంట్లనూ వదుల్తలేరు కొంతమంది సిబ్బంది. గాంధీలోని ఎఎమ్‌ సీ వార్డులో ఓ కరోనా పేషెంట్ నుంచి నగలు దొంగలిస్తూ ముగ్గు రు వార్డ్ బాయ్స్ పట్టు బడినట్లు తెలిసింది. వీళ్లు నగలు దొంగలిస్తుండగా గమనించిన… కొంతమంది డ్యూటీలో ఉన్న పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయంబయటకు తెలియనివ్వకుండా పోలీసులు వాళ్లను ఎంక్వైరీ చేస్తున్నారు. కరోనా పేషెంట్ల వార్డులో పనిచేయాలంటే కచ్చితంగా పీపీఈ కిట్స్ వాడాల్సి ఉండటంతో ఇదే ఆసరాగా చేసుకొని కొంతమంది సిబ్బందే ఇలా దొంగతనాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరు గుర్తుపట్టారన్న ఉద్దేశంతో  కొంతమంది సిబ్బంది కరోనా పేషెంట్ల ఫోన్లు కూడా దొంగలిస్తున్నట్లు తెలిసింది.