స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్​ రిలీజ్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్​ రిలీజ్

ఢిల్లీ పోలీసు విభాగంలో 4300 సబ్‌‌ ఇన్‌‌స్పెక్టర్‌‌, సెంట్రల్‌‌ ఆర్మ్‌‌డ్‌‌ పోలీస్‌‌ ఫోర్సెస్‌‌ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌‌ఎస్‌‌సీ) నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌‌లైన్‌‌లో ఆగస్టు 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టులు:  మొత్తం 4300 ఖాళీల్లో ఢిల్లీ పోలీసు విభాగంలో సబ్-ఇన్‌‌స్పెక్టర్(పురుషులు) 228, మహిళలకు 112 పోస్టులు ఉన్నాయి. సెంట్రల్ ఆర్మ్‌‌డ్‌‌ పోలీసు ఫోర్సు(సీఆర్‌‌పీఎఫ్‌‌)లో సబ్-ఇన్‌‌స్పెక్టర్(జీడీ) ఖాళీలు 3960  అందుబాటులో ఉన్నాయి.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత, 20 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌‌టీ)/ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (పీఈటీ), మెడికల్ ఎగ్జామినేషన్ (డీఎంఈ), ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా సెలెక్షన్​ ప్రాసెస్​ ఉంటుంది. రూ.100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులకు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది) అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్​లో ఎగ్జామ్​ సెంటర్స్​ ఉన్నాయి. 

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్‌‌లైన్​లో ఆగస్టు 30 వరకు అప్లై చేసుకోవాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష షెడ్యూల్​ నవంబర్​లో ఉంటుంది. పూర్తి వివరాలకు www.ssc.nic.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.