రెడ్ల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

రెడ్ల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

రాజబహుదూర్ వెంకట రామిరెడ్డి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. హైదరాబాదులో రెడ్డి విద్యార్థి వసతిగృహం నెలకొల్పిన మహనీయిడు వెంకటరామిరెడ్డి అన్నారు. రెడ్ల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ఈ సందర్భంగా అబిడ్స్ లోని రెడ్డి జన సంఘంలో వెనుక బడిన పలువురు విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందించారు మంత్రి. భవిష్యత్తులో రెడ్డి విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేలా కొత్త వసతి గృహలు నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు సబితా.