రైల్వే పనులు ముంగట పడ్తలేవు

 రైల్వే పనులు ముంగట పడ్తలేవు

మహబూబ్​నగర్, వెలుగు: పరిశ్రమలు, గ్రానైట్, బంగారం, పట్టు చీరల ఉత్పత్తికి పేరు పొందిన వికారాబాద్, నారాయణపేట ప్రాంతాల మధ్య కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు రాష్ర్ట సర్కారు గ్రీన్​ సిగ్నల్​ ఇవ్వడం లేదు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల సౌజన్యంతో వికారాబాద్​-కృష్ణ రైల్వే లైన్​పనులు చేపట్టాల్సి ఉండగా, ఏండ్లు కావస్తున్నా తెలంగాణ సర్కారు భూ సేకరణకు ముందుకు రావట్లేదు.

40 ఏండ్ల కిందటే సర్వే..

మొదటి సారిగా 1980లో వికారాబాద్​-కృష్ణ రైల్వే లైన్ తెరమీదకు వచ్చింది. ఈ ప్రాజెక్టును చేపట్టాలని 1988లో రూ.90 కోట్లతో విరాకాబాద్ నుంచి పరిగి, కోస్గి, మద్దూరు, ఊట్కూరు, నారాయణపేట, కృష్ణ వరకు రైల్వే లైన్​ నిర్మించాలని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. సర్వే చేసినా రైల్వే బడ్జెట్ లో కేంద్రం నిధులు ఇవ్వకపోవడంతో ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. 20 ఏండ్ల తర్వాత 2008లో ఉమ్మడి ఏపీలోని అప్పటి కాంగ్రెస్​ప్రభుత్వం ఈ ప్రాజెక్టును టేకప్​ చేసేందుకు రీ సర్వే చేయించింది. దీనిలో మార్పులు చేసి రైల్వే లైన్​ను వికారాబాద్‌‌‌‌‌‌‌‌ నుంచి పరిగి, దోమ, సర్జఖాన్‌‌‌‌పేట, కొడంగల్, బొంరాస్‌‌‌‌పేట, దౌల్తాబాద్‌‌‌‌, మద్దూరు, నారాయణపేట, ఊట్కూర్, మక్తల్, మాగనూర్‌‌‌‌ మీదుగా కృష్ణ(127 కిలోమీటర్లు) వరకు రైల్వే లైన్​ ఏర్పాటు చేయాలని రూ.1,100 కోట్లతో ప్రతిపాదనలు చేసింది. కేంద్ర, రాష్ర్టాలు 50 శాతం నిధులు ఖర్చు చేసేలా ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ మేరకు అప్పటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున్​ఖర్గే పరిగి ప్రాంతంలో పర్యటించి పనులు చేపడతామని హామీ ఇచ్చినా ఆచరణ జరగలేదు.

ఎనిమిదేండ్లు అయినా స్పందిస్తలే..

రాష్ర్ట ఏర్పాటు అనంతరం 2014లో ఈ ప్రాజెక్టును రాష్ర్ట ప్రభుత్వం పట్టాలెక్కిస్తుందని భావించారు. రాష్ర్టం ఏర్పడి ఎనిమిదేండ్లు కావస్తున్నా టేకప్ చేయట్లేదు. 2017లో మరోసారి కేంద్రం ఈ పనులు చేసేందుకు అంగీకారం తెలిపినా, ఇప్పటి వరకు రాష్ర్ట ప్రభుత్వం రెస్పాండ్​కాలేదు. ఇటీవల కేంద్ర మంత్రి జి.కిషన్​రెడ్డి సీఎం కేసీఆర్​కు ఈ విషయంపై లేఖ రాసినా ఆయన స్పందన లేదు. అయితే ఈ ప్రాజెక్టును టేకప్​ చేసేందుకు దాదాపు రూ.4 వేల కోట్లు ఖర్చు కానుంది. ఇంత ఖర్చు చేయలేక రాష్ర్టం వెనుకాడుతోందన్న వాదన వినిపిస్తోంది. దీనికితోడు భూసేకరణకు కూడా పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించాల్సి వస్తుందనే పక్కకు పెట్టిందనే టాక్​వస్తోంది.

రాయచూర్​కు షార్ట్​కట్...​

పరిగి, కొడంగల్, దోమ, వికారాబాద్​ప్రాంతాల నుంచి దాదాపు పది వేల మంది ఉద్యోగులు, స్టూడెంట్లు నిత్యం హైదరాబాద్​కు రాకపోకలు సాగిస్తుంటారు. నారాయణపేట ప్రాంతం నుంచి బంగారం, చీరల వ్యాపారాల నిమిత్తం రాయచూర్, గుల్బర్గా, మహారాష్ర్టల నుంచి ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రైల్వే లైన్​ఏర్పాటు ద్వారా వికారాబాద్, పరిగి, కొడంగల్, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లోని ప్రజలకు రవాణా భారం తగ్గనుంది. వికారాబాద్​ నుంచి రాయచూర్​వెళ్లడానికి కూడా షార్ట్ కట్ రూట్అవుతుంది.


పనులు చేయాలని లెటర్​రాసినా రిప్లై లేదు..

2017లో రైల్వే శాఖ నుంచి రాష్ర్ట ప్రభు త్వానికి లెటర్ ఇచ్చారు. రైల్వే ట్రాక్​నిర్మాణానికి భూమి చూపించాలని కోరి నా ఇంత వరకు రాష్ర్ట ప్రభుత్వం స్పందిం చడం లేదు. కొద్ది రోజుల కింద ఈ విష యంపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్​రెడ్డి కూడా సీఎం కేసీఆర్​కు లేఖ రాశారు. అయితే ఇప్పటి వరకు ఆ లెటర్​కు రీప్లై కూడా లేదు.‌‌‌‌‌‌‌‌-

నాగూరావు నామాజీ, బీజేపీ స్టేట్ లీడర్, నారాయణపేట

సీఎం కేసీఆర్​కు ఆసక్తి లేదు..

రాష్ర్ట ఏర్పాటు తర్వాత పరిగి ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్​ను వెళ్లి కలిశా. సీఎంకు ఈ ప్రాంతం మీద, వికారాబాద్​-కృష్ణ రైల్వే లైన్​మీద ఆసక్తి లేదు. ఈ రైల్వే లైన్ అం శంపై అసెంబ్లీలో కూడా మాట్లాడా. కానీ శాంక్షన్ అయిన ఈ ప్రాజెక్టును తొక్కి పెట్టేసిండ్రు. ఈ రైల్వే లైన్​ఏర్పాటు చేస్తే పరోక్షంగా పది వేల మంది ఉద్యోగులు, స్టూడెంట్లకు మేలు జరుగుతుంది. ఆ విషయాన్ని రాష్ర్ట సర్కారు గుర్తిస్తలేదు.
–టి.రాంమోహన్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే