- ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి, వెలుగు: ఉమ్మడి పాలమూరులోని జూరాల, కోయిల్సాగర్, నెట్టెంపాడులతో పాటు శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్ తదితర ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో కట్టినవేనని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వనపర్తిలోని పార్టీ ఆఫీస్లో డీసీసీ ప్రెసిడెంట్ శివసేనారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.
వనపర్తి జిల్లాలో ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్ల నుంచి 4 టీఎంసీల నీటిని వదిలామన్నారు. పనిపాట లేని బీఆర్ఎస్ లీడర్లు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారన్నారు. తాము ప్రెస్మీట్పెట్టాకనే నీరు వదిలారని మాట్లాడే బీఆర్ఎస్ మాజీ మంత్రి.. ఒక్క రోజులో నాలుగు టీఎంసీల నీటిని వదలడం సాధ్యమా అని ప్రశ్నించారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కమీషన్ల కోసం టెండర్లు పిలిచి ఇప్పటికీ పూర్తి చేయలేదన్నారు. ఈ నెలాఖరులో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ వనపర్తికి రానున్నారని తెలిపారు. ప్రెస్మీట్లో మున్సిపల్చైర్పర్సన్ మాధవి, లీడర్లు ధనలక్ష్మి, బ్రహ్మచారి, సాయిచరణ్రెడ్డి, తిరుపతయ్య, బి.కృష్ణ
పాల్గొన్నారు.
