ఎల్బీ స్టేడియంలో కాసేపట్లో CM KCR ఇఫ్తార్

ఎల్బీ స్టేడియంలో కాసేపట్లో CM KCR ఇఫ్తార్

రంజాన్ సందర్భంగా రాష్ట్రప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తార్ ఇస్తోంది. ఎల్బీ స్టేడియంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యయి. సాయంత్రం ఇఫ్తార్ విందు కార్యక్రమం మొదలుకానుంది.

సాయంత్రం 6.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో విందు కార్యక్రమానికి వస్తారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, రాష్ట్ర మంత్రులు, ఇతర నాయకులు, ముస్లింలు హాజరు కానున్నారు. ఖర్జూర, పండ్లు, ఇతర ఆహార పదార్థాలు ఇప్పటికే ఎల్బీ స్టేడియంలో సిద్ధం చేశారు.

రంజాన్ సందర్భంగా రాష్ట్రప్రభుత్వం ముస్లిం సోదరులకు దుస్తులు కానుకగా అందజేయాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో ముస్లింలకు బట్టలు పంపిణీ చేయనుంది ప్రభుత్వం.