ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతలు.. అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా నష్టాల్లో కొనసాగుతున్నాయి. రష్యాపై స్విఫ్ట్ బహిష్కరణతో సూచీలు నష్టాల్లోకి పడిపోతున్నాయి. సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా.. నిఫ్టీ 200 పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతున్నాయి. అమెరికా ఫ్యూచర్స్ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆసియా–పసిఫిక్ సూచీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. అధిక చమురు ధరలు, సరఫరా ఇబ్బందులపై భయాలు, విదేశీ అమ్మకాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీస్తున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.70 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్–30 సూచీలో టాటా స్టీల్ పవర్ గ్రిడ్ మాత్రమే లాభాల్లో ఉంది.
Sensex down 760.46 points, at 55,098.06 in opening trade. pic.twitter.com/S0nJqTKO0z
— ANI (@ANI) February 28, 2022
మరిన్ని వార్తల కోసం: