ఏపీలోని సింగరాయకొండ దగ్గర న్యూఢిల్లీ- చెన్నై ఎక్స్ ప్రెస్ రైలుపై ఆకతాయిలు దాడి చేశారు. వేగంగా వెళ్తున్న రైలుపై రాళ్లువిసిరారు. దీంతో రైలు అద్దాలు పగిలి సీనియర్ అసిస్టెంట్ లోకోపైలట్ జయరాం తీవ్రంగా గాయపడ్డాడు. ఘటన జరిగిన వెంటనే రైలును సమీప ఉలవపాడు రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు. చికిత్స కోసం జయరామ్ ను సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటనపై విచారణ చేపట్టారు రైల్వే అధికారులు.
