మే 26 వరకు శ్రామిక్‌ రైళ్లను పంపకండి

మే 26 వరకు శ్రామిక్‌ రైళ్లను పంపకండి
  • కేంద్రాన్ని కోరిన పశ్చిమబెంగాల్‌ సర్కార్‌‌
  • అంపన్‌ తుపాను కారణంగా నిర్ణయం

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌లో అంపన్‌ తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్నందున ఈ నెల 26 వరకు శ్రామిక్‌ రైళ్లను రాష్ట్రానికి పంపొద్దని సీఎం మమతా బెనర్జీ రైల్వే శాఖను కోరింది. ఈ మేరకు వెస్ట్‌ బెంగాల్‌ చీఫ్‌ సెక్రటరీ రాజీవ్‌ సిన్హా రైల్వే బోర్డు చైర్మన్‌ వీకె. యాదవ్‌కు లెటర్‌‌ రాశారు. తుపాను వల్ల రాష్ట్రం అతలాకుతలం అయిందని, అన్ని దెబ్బతిన్నాయని అందుకే రైళ్లను పంపొద్దని లెటర్‌‌లో కోరారు. “జిల్లా అధికారులంతా రిలీఫ్‌, పునరావాస పనుల్లో ఉన్నారు. శ్రామిక్‌ రైళ్లలో వచ్చే వారిని పట్టించుకునే వీలు ఉండదు. అందుకే రైళ్లను నిలిపేయండి” అని అన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వివిధ ప్రదేశాల్లో చిక్కుకున్న కూలీలను తరలించేందుకు ప్రభుత్వం శ్రామిక్‌ రైళ్లను ఏర్పాటు చేసింది. అంపాన్‌ తుపాను పశ్చిమబెంగాల్‌లో బీభత్సం సృష్టించింది. తుపాను ధాటికి 86 మంది చనిపోయారు. భారీ ఈదురుగాలులకు చెట్టు కూలిపోయాయి. భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.