స్ట్రాంగ్ రూమ్ ల దగ్గర మూడంచల భద్రత: డీజీపీ

స్ట్రాంగ్ రూమ్ ల దగ్గర మూడంచల భద్రత: డీజీపీ

రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి. ప్రజలు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ప్రశాంతతకు భంగం కలుగకుండా సహకరించిన ప్రజలందరికి ధన్యవాదాలు తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు.  అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో పోలింగ్ సజావుగా ముగిసిందన్నారు. భవిష్యత్ లోనూ ప్రజలు సహకరించాలన్నారు. కొన్ని చోట్ల చిన్న చిన్న సంఘటనలు మినహా ఎక్కడా హింస చోటుచేసుకోలేదని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్న డీజీపీ మహేందర్ రెడ్డి….స్ట్రాంగ్ రూమ్ ల  దగ్గర మూడంచల భద్రత కల్పిస్తామన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కేంద్ర పోలీసు బలగాలతో పహారా కాస్తున్నట్లు తెలిపారు.