అన్నా చనిపోతున్నా.. సోదరుడికి మెసేజ్పెట్టి యువకుడు మిస్సింగ్

అన్నా చనిపోతున్నా.. సోదరుడికి మెసేజ్పెట్టి యువకుడు మిస్సింగ్

కూకట్​పల్లి, వెలుగు: జేఎన్‎టీయూలో పీజీ చేస్తున్న యువకుడు మిస్సయ్యాడు. కేపీహెచ్‎బీ పోలీసులు తెలిపిన ప్రకారం.. ఎగ్గడి లోకేశ్(23) జేఎన్​టీయూ హాస్టల్‎లోనే ఉంటూ పీజీ చదువుతున్నాడు. వారం రోజుల నుంచి ఫోన్​ స్విచాఫ్  వస్తోంది. వాట్సప్‎లో తన సోదరుడు పవన్‎కు మెసేజ్​పెట్టాడు. ఆన్​లైన్​ బెట్టింగ్‎లో పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నానని, అప్పులు ఎక్కువయ్యాయని, చనిపోవాలనుకుంటున్నానని చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని లోకేశ్​ఆచూకీ కోసం గాలిస్తున్నారు.