విద్యార్ధులే లక్ష్యంగా…గంజాయి సరఫరా

విద్యార్ధులే లక్ష్యంగా…గంజాయి సరఫరా

కరీంనగర్ జిల్లా : విద్యార్ధులే లక్ష్యంగా…గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. వారి దగ్గరి నుంచి 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ అడవుల్లో అక్రమంగా గంజాయిని సాగుచేస్తున్నారు ఈ కేటుగాళ్లు.

ఎండిన గంజాయిని ఎవరీకి అనుమానం రాకుండా బస్సులు, బైక్ లపై కరీంనగర్, వరంగల్ హైదరాబాద్ లాంటి నగరాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొద్దిరోజులుగా వీరిపై నిఘా పెట్టిన పోలీసులు కరీంనగర్ గీతాభవన్ పట్టుకున్నారు.