
ఓయూ, వెలుగు : మంత్రి ఓయూ క్యాంపస్కు తొలిసారి వచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. సోమవారం లా కాలేజీ వద్ద ఆమెను గజమాలతో సత్కరించారు.
మంత్రిని సన్మానించిన వారిలో ఓయూ జేఏసీ చైర్మన్ ఓరుగంటి కృష్ణ , పీడీఎస్యూ నేతలు లెనిన్, పొలిటికల్ జేఏసీ చైర్మన్ కె. చంద్రశేఖర్, బీఎస్ఎఫ్ అంబేడ్కర్ పొలిటికల్ తెలంగాణ స్టూడెంట్స్ జేఏసీ ప్రెసిడెంట్ వలిగొండ నరసింహ, బీఎస్ఎఫ్ నేతలు బోరెల్లి సురేశ్, ఓయూ జేఏసీ రాజు, అఖిల్, బాలు, సతీశ్, సింహాద్రితో పాటు ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు ఉన్నారు.