డిగ్రీ ఫలితాల్లో అంబేద్కర్ విద్యాసంస్థల హవా

డిగ్రీ ఫలితాల్లో అంబేద్కర్ విద్యాసంస్థల హవా

ముషీరాబాద్,వెలుగు: బాగ్ లింగంపల్లిలోని అంబేద్కర్ విద్యాసంస్థలకు చెందిన స్టూడెంట్లు చదువులో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. ఇటీవల రిలీజైన ఓయూ పరిధి డిగ్రీ బీఏ ఫైనలియర్  ఫలితాల్లో అంబేద్కర్ కాలేజీ స్టూడెంట్ రోనాక్ అగర్వాల్ 9.6 గ్రేడ్ సాధించి రాష్ట్ర స్థాయిలో టాపర్​గా నిలిచాడు. ఈ సందర్భంగా గురువారం అంబేద్కర్ విద్యా సంస్థల మేనేజ్ మెంట్, ఫ్యాకల్టీ రోనాక్​ను సత్కరించి అభినందించింది. ఫ్యాకల్టీ, మేనేజ్ మెంట్ సపోర్టుతో మంచి గ్రేడ్ సాధించానని రోనాక్ తెలిపాడు. కాకా వెంకటస్వామి ఆశయాలతో కొనసాగుతున్న అంబేద్కర్ విద్యాసంస్థలు పేద స్టూడెంట్లకు వరంగా మారాయి.

స్కూల్ నుంచి మొదలుకొని ఇంటర్, డిగ్రీ, లా, ఎంబీఏ, ఇతర పీజీ కోర్సులన్నింటిలో స్టూడెంట్లు సత్తా చాటుతున్నారు. లా, పీజీ సెట్ లో స్టేట్ ర్యాంక్ తో పాటు ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో తమ స్టూడెంట్లు మంచి గ్రేడ్ సాధించారని మేనేజ్ మెంట్ తెలిపింది.