భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మద్దుకూరు జడ్పీ స్కూల్ సమీపంలో నేష్నల్ హైవే టర్నింగ్పాయింట్వద్ద సోమవారం బొగ్గులోడ్ ఉన్న టిప్పర్లారీ బోల్తా పడింది. ఈ సమయంలో స్టూడెంట్స్లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
కాగా, స్కూల్సమీపంలోని ఈ టర్నింగ్వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల ఓ లారీ అదుపుతప్పి స్కూల్గోడలో నుంచి క్లాస్రూమ్లోకి దూసుకెళ్లింది. దీంతో ప్రమాదాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ విద్యార్థులు నిరసన తెలిపారు.
-చండ్రుగొండ, వెలుగు
