ప్రభుత్వ విద్యాలయాల బాగు కోసం అది చేస్తున్నాం.. ఇది చేస్తున్నాం అని బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. కానీ గ్రౌండ్లెవల్లో రియాలిటీ వేరేగా ఉంటోంది. కాలేజీల్లో చదువు చెప్పే సార్లు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. బోధన సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు రోడ్డుపై వచ్చి ధర్నా చేసిన ఘటన కుత్బుల్లాపూర్లో జరిగింది.
బహదూర్ పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్క్లాసులు చెప్పడానికి సరిపడా లెక్చరర్లు లేరని కాలేజీ గేటు ముందు జులై 24న ధర్నా నిర్వహించారు. దీనికి తోడు కళశాలలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న వారికి ఏబీవీపీ సంఘీభావం తెలిపింది.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. లెక్చరర్లు లేకపోవడంతో ఒకే సబ్జెక్టులో గతేడాది 100 మంది స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారని వాపోయారు. ఈ ఏడాది కూడా కొన్ని సబ్జెక్టులకు లెక్చరర్లు లేరని బుక్స్ ఇప్పటిదాకా ఇవ్వలేదని చెప్పారు. ప్రిన్సిపల్ని ఇదే విషయంపై ప్రశ్నించగా.. టీసీ తీసుకొని వెళ్లిపోండని అంటున్నారని విద్యార్థులు ఆరోపించారు.
ALSO READ:డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన కానిస్టేబుల్ అభ్యర్థులు.. తీవ్ర ఉద్రిక్తత
ప్రైవేటుకు వెళ్లి చదువుకుందామన్నా ఆర్థిక పరిస్థితి సహకరించట్లేదని వారు అన్నారు. ధర్నా క్రమంలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న దుండిగల్ పోలీసులు విద్యార్థి నేతలను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఇదే విషయంపై ప్రిన్సిపల్వివరణ కోరగా.. లెక్చరర్లను రిక్రూట్ చేసుకుంటున్నామని, ఆగస్టు నుంచి అందుబాటులోకి వస్తారని అన్నారు.