డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన కానిస్టేబుల్ అభ్యర్థులు.. తీవ్ర ఉద్రిక్తత

డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన కానిస్టేబుల్ అభ్యర్థులు.. తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్ : లక్డీకపూల్ లోని డీజీపీ కార్యాలయాన్ని కానిస్టేబుల్ అభ్యర్థులు ముట్టడించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, కానిస్టేబుల్ అభ్యర్థులకు మధ్య తోపులాట, వాగ్వివాదం జరగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. 

ALSO READ:టీచింగ్​ స్టాఫ్ లేరని విద్యార్థుల ధర్నా

2022 నోటిఫికేషన్ లో కానిస్టేబుల్ నియామకాల్లో తీసుకువచ్చిన  జీవో నెంబర్ 46 రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. పాత పద్ధతిలోనే నియమాలు చేపట్టి.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. జీవో 46 వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.