
వర్ని, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల సర్వే పకడ్బందీగా చేయాలని, అవినీతికి ఆస్కారం ఉండకుండా చర్యలు తీసుకోవాలని సబ్కలెక్టర్ వికాస్ మహతో ఆదేశించారు. వర్ని మండలంలోని పొట్టిగుట్ట తండాలో గురువారం చేపట్టిన సర్వేను ఆయన పరిశీలించాలి. లబ్ధిదారులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. అర్హులకే ఇండ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఎంపీడీవో మారుతి, వెరిఫికేషన్ ఆఫీసర్ సతీశ్, జీపీ సెక్రటరీలు శ్రీకాంత్, ముస్తాక్హుస్సేన్ తదితరులున్నారు.