
మెహిదీపట్నం, వెలుగు: జీహెచ్ఎంసీ సర్కిల్ 13 (కార్వాన్) టౌన్ ప్లానింగ్ ఏసీపీ మంత్రి సుమన(51) అనారోగ్యంతో మంగళవారం రాత్రి యూసుఫ్ గూడాలోని తన ఇంట్లో మృతిచెందారు. సర్కిల్ 13 టౌన్ ప్లానింగ్ ఏసీపీగా ఆరు నెలల క్రితం నియమితులయ్యారు. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. సోమవారం క్యాన్సర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి ఇంటికి వచ్చారు. మరుసటి రోజే ఆమె కన్నుమూశారు. సీసీపీ శ్రీనివాస్, సీపీ సాంబయ్య, ఏసీపీలు సంతోష్, శ్రీనివాస్, సైదుద్దీన్, సెక్షన్ ఆఫీసర్ పీవీ ప్రకాష్, కార్వాన్ ఎమ్మెల్యే మహమ్మద్ కౌసర్ మొయినుద్దీన్, డిప్యూటీ కమిషనర్ శశిరేఖ సంతాపం తెలిపారు.