ప్రేమ.. పెళ్లి.. ఆత్మహత్యాయత్నం

ప్రేమ.. పెళ్లి.. ఆత్మహత్యాయత్నం

సత్తుపల్లి, వెలుగు : ఓ బాలికను ప్రేమించాడు… అమె గర్భవతి అయ్యింది. అయితే ఆమెతో తనకు సంబంధం లేదని సదరు యువకుడు దూరంగా ఉన్నాడు. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లడంతో వారు పెద్దమనుషుల సమక్షంలో పెండ్లి జరిపించారు. దీంతో మనస్తాపం చెందిన అతడు పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్​ చేశాడు. యువకుడి తల్లిదండ్రుల కథనం ప్రకారం… మండల పరిధిలోని కిష్టారం గ్రామానికి చెందిన మొండ్రు అశోక్ వేంసూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బాలికను ప్రేమించాడు. బాలిక అమ్మమ్మది కిష్టారం కావడంతో తన అమ్మమ్మ ఇంటికి వచ్చిన క్రమంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

కొంతకాలానికి బాలిక గర్భం దాల్చడంతో అశోక్ ను ఫోన్ లో సంప్రదించగా తనకు సంబంధం లేదని చెప్పాడు. దీంతో వారు వేంసూరు పోలీసులును ఆశ్రయించారు. దీంతో ఎస్ ఐ అశోక్ ఈ నెల 18న పెద్ద మనుషుల సమక్షంలో గుడిలో పెండ్లి జరిపించారు. తర్వా త బాలికను అబ్బాయి ఇంటికే పంపించారు. తనకు బలవంతంగా పెండ్లి చేశారని మనస్తాపం చెందిన అశోక శుక్రవారం పురుగుల మందు తాగాడు. సత్తుపల్లిలోని ప్రైవేట్ దవాఖానాకు , అక్కడి నుంచి మెరుగైన ట్రీట్ మెంట్ కోసం విజయవాడ తీసుకువెళ్లారు.