రూ. 200 కోట్ల మనీలాండారింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ ... తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్కు లేఖ రాశారు. ఈ లేఖలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్ లపై సంచలన ఆరోపణలు చేశారు. తన వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని కవిత, కేటీఆర్ సన్నిహితులు తనపై ఒత్తిడి తెస్తున్నారని సుఖేష్ ఆరోపించారు. ఆధారాలు ఇస్తే రూ.100 కోట్ల నగదు, శంషాబాద్ వద్ద భూమి, అసెంబ్లీ సీట్ ఇస్తామని ఆశపెడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్లలోని ఎవిడెన్స్ ఇవ్వమని అడుగుతున్నారు.
ALSOREAD:బోనాలు ఆషాడమాసంలోనే ఎందుకు చేస్తారు
దాదాపు 200 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, కవితకు తనకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ అంతా రికార్డింగ్ ఉందన్నారు సుఖేష్. ఈ ఆధారాలని ఇప్పటికే ఈడీకి 65 -బి సర్టిఫికెట్ రూపంలో ఇచ్చేశానని, కవిత నుంచి రూ.15 కోట్ల నగదు తీసుకొని అరవింద్ కేజ్రీవాల్ తరపు వారికి అందజేశానని, ఈ అంశాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతున్నట్టుగా గవర్నర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు సుఖేష్.