
హైదరాబాద్, వెలుగు: నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి పేరును పార్టీ చీఫ్ కేసీఆర్ ఖరారు చేశారు. బుధవారం ప్రగతి భవన్లో ప్రస్తుత నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, కేసీఆర్ చేతుల మీదుగా ఆమె బీఫామ్ అందుకున్నారు. మదన్ రెడ్డికి పార్లమెంట్ఎన్నికల్లో మెదక్లోక్సభ స్థానం నుంచి పోటీచేసే అవకాశం ఇవ్వనున్నారని బీఆర్ఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది. కేసీఆర్ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ కోర్కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. మదన్రెడ్డి మొదటి నుంచి తనతో పాటు కొనసాగుతున్న సీనియర్నాయకుడని, తనకు కుడిభుజం లాంటి వారని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు. పార్టీ ఆలోచనను గౌరవించి నర్సాపూర్లో సునీత గెలుపునకు కృషి చేస్తున్నారన్నారు. ప్రస్తుత మెదక్ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండడంతో ఆ స్థానం నుంచి మదన్రెడ్డికి అవకాశం ఇస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు తదితరులు పాల్గొన్నారు.
రెండు నెలలుగా పెండింగ్..
సిట్టింగ్ఎమ్మెల్యే మదన్రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి మధ్య విభేదాల కారణంగా ఇక్కడ రెండు నెలలుగా నర్సాపూర్ అభ్యర్థిని ప్రకటించలేదు. చివరికి ఇద్దరు నేతల మధ్య కేసీఆర్ సయోధ్య కుదిర్చి సునీతకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. ఆమెకు బీఫామ్ ఇవ్వడంతో ఇప్పటివరకు బీఆర్ఎస్ నుంచి బీఫామ్లు తీసుకున్నవారి సంఖ్య 110కి చేరింది. ఇంకా ఆలంపూర్, గోషామహల్తోపాటు ఓల్డ్సిటీలో ఎంఐఎం ప్రాతినిథ్యం వహిస్తోన్న ఏడు స్థానాల్లో పోటీ చేసే క్యాండిడేట్లకు బీఫాంలు ఇవ్వాల్సి ఉంది. ఆలంపూర్లో సిట్టింగ్ఎమ్మెల్యే అబ్రహంకు టికెట్ప్రకటించినా అక్కడి పార్టీ నేతలు ఆయనను తప్పించి మరొకరికి చాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇటీవల 500 మందికి పైగా నేతలు ప్రగతి భవన్కు వచ్చి కేటీఆర్ను కలిసి ఇదే డిమాండ్వినిపించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ముఖ్య అనుచరుడు విజేయుడు పేరు కూడా అక్కడి నుంచి పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లోనే పెండింగ్ స్థానాలను ఫైనల్చేస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.