మైనంపల్లికి బీఆర్​ఎస్​..అసంతృప్తుల మద్దతు

మైనంపల్లికి బీఆర్​ఎస్​..అసంతృప్తుల మద్దతు

 మెదక్, వెలుగు : మల్కాజ్​ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్​ పార్టీలో చేరనున్న నేపథ్యంలో మెదక్​ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీఆర్​ఎస్​ పార్టీ అసంతృప్త నాయకులు మంగళవారం దూలపల్లిలోని ఆయన ఇంట్లో కలిశారు. రామాయంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, అడ్వకేట్​జీవన్ రావు, చిన్నశంకరంపేట సర్పంచ్​ రాజిరెడ్డి 

ALSO READ : బీసీల అభివృద్ధికి కృషి చేస్తున్నాం: గువ్వల బాల్ రాజు

పాపన్నపేట మండల బీఆర్​ఎస్​ మాజీ అధ్యక్షుడు ప్రశాంత్​ రెడ్డి, రంగారావు, సుధాకర్, మనోజ్​,నోముల శ్రీకాంత్​, స్వామి నాయక్, రమేశ్​గౌడ్, కరుణాకర్​ తదితరులు మైనంపల్లికి మద్దతు తెలిపారు. కాంగ్రెస్​ పార్టీలో చేరేందుకు మైనంపల్లి హన్మంతరావు ఢిల్లీ వెళ్లగా కొందరు నాయకులు ఆయన వెంట వెళ్లారు.