కార్తీ చిదంబరం విదేశాలకు వెళ్లేందుకు సుప్రీం అనుమతి

కార్తీ చిదంబరం విదేశాలకు వెళ్లేందుకు సుప్రీం అనుమతి

కేంద్ర మాజీ ఆర్థికశాఖ మంత్రి చిదంబరం కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరంకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. విదేశాలకు వెళ్లేందుకు షరతులతో కూడిన పర్మిషన్ ను సుప్రీం మంజూరు చేసింది. రూ. 2 కోట్లను కోర్టులో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. రూ. 305 కోట్ల INX మీడియా మనీ లాండరింగ్ కేసులో కార్తీ చిదంబరం విచారణను ఎదుర్కొంటున్నారు.

మరోవైపు రూ. 2 కోట్లు డిపాజిట్ చేయాలనే సుప్రీంకోర్టు ఆదేశాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ED) అభ్యంతరం వ్యక్తం చేసింది. రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని వేరే కోర్టు ఆదేశించిందని… అదే మొత్తాన్ని సుప్రీంకోర్టు కూడా కొనసాగించాలని కోరింది. ఈ  క్రమంలో కార్తీ తరపున వాదిస్తున్న కాంగ్రెస్ నేత, సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబాల్ .. తన క్లయింట్ పార్లమెంటు సభ్యుడని, ఆయన ఎక్కడికీ పారిపోరని అన్నారు. రూ. 10 కోట్లు డిపాజిట్ చేయాలనే ఆదేశాలను కొట్టివేయాలని కోరారు. సిబాల్ వాదనతో ఏకీభవించిన సుప్రీం ధర్మాసనం రూ. 2 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది.

ఈ కేసులో 22 రోజుల పాటు ఢిల్లీలోని తీహార్ జైల్లో కార్తీ చిదంబరం గడిపారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు.