క్రిస్మస్ సెలబ్రేషన్స్లో పాటలు పాడిన చీఫ్ జస్టిస్

క్రిస్మస్ సెలబ్రేషన్స్లో పాటలు పాడిన చీఫ్ జస్టిస్

వృతిరీత్యా ఎప్పుడు బిజీబిజీగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ క్రిస్మస్ వేడుకల్లో సోమవారం (డిసెంబర్ 25న) సందడి చేశారు. అతిథులతో కలిసి క్రిస్మస్ పాటలు పాడి.. అందరిలోనూ ఉత్సాహం నింపారు. 

సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకలకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రిస్మస్ పాటను జస్టిస్ డీవై చంద్రచూడ్ పాడారు. ఇప్పుడు ఈ పాట వైరల్‌గా మారింది. 

వేదికపై వెళ్లిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్.. వేడుకల్లో పాటలు పడుతున్న వారిని అనుకరించారు. మైక్ పట్టుకుని.. వారితో పాటు పాటలు పాడి సందడి చేశారు. అంతేకాదు.. మిగతా వారిని కూడా ఎంకరేజ్ చేస్తూ మరింత హుషారెత్తించారు. మరోవైపు.. చీఫ్ జస్టిస్ రాకతో వేడుకల్లో పాల్గొన్నవారంతా హర్షం వ్యక్తం చేశారు.