న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సబంధించిన కేసులో వాట్సాప్ యూనివర్సిటీ అభిప్రాయాలు తప్ప.. మిగతా అందరి అభిప్రాయాలను స్వీకరిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మతపరమైన ప్రదేశాలలో మహిళల పట్ల వివక్షపై దాఖలైన పిటిషన్లపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ బెంచ్ గురువారం విచారణ జరిపింది. మత అంశాలపై కోర్టు సంయమనం పాటించాలని కాంగ్రెస్ నేత శశి థరూర్ రాసిన వ్యాసం ప్రస్తావనకు రాగా.. సీజేఐ స్పందించారు.
అది వ్యక్తిగత అభిప్రాయమేనన్నారు. దీనికి అడ్వకేట్ కౌషల్ కౌల్ స్పందిస్తూ.. జ్ఞానం ఏ దేశం, ఏ యూనివర్సిటీ నుంచి వచ్చినా స్వీకరించాలన్నారు. దీంతో బెంచ్ జోక్యం చేసుకుని ‘వాట్సాప్ యూనివర్సిటీ’ నుంచి మాత్రం కాదని వ్యాఖ్యానించింది.

