ఎన్సీపీ వర్కింగ్​ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే,  ప్రఫుల్​ పటేల్​

ఎన్సీపీ వర్కింగ్​ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే,  ప్రఫుల్​ పటేల్​

నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ(ఎన్సీపీ) 25వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా ఆ పార్టీ స్థాపకుడు, అధ్యక్షుడు శరద్​ పవార్​ వర్కింగ్​ప్రెసిడెంట్ల పేర్లు ప్రకటించారు. పవార్​ కుమార్తె సుప్రియా సూలే, పార్టీ వైస్​ప్రెసిడెంట్​ప్రఫుల్​పటేల్​కు వర్కింగ్​ ప్రెసిడెంట్​ హోదాను కట్టబెట్టారు. మహారాష్ర్ట, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు, మహిళలు, లోక్​ సభ కోఆర్డినేషన్ తదితర వ్యవహారాలను సుప్రియా చూడనున్నారు.

మధ్య ప్రదేశ్​, రాజస్థాన్​, గోవాలను ప్రఫుల్​పటేల్​కి అప్పగించారు. గత నెలలో ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని శరద్​ పవార్​ ప్రకటించారు. కానీ అనుచరులు, పార్టీ నాయకులు, కార్యకర్తల ఒత్తిడితో ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గారు.  ఎన్సీపీ ప్యానెల్​ కూడా ఆయన రాజీనామాను తిరస్కరించింది. 1999 లో పవార్​, పీఏ సంగ్మా ఎన్సీపీని స్థాపించారు.