నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) 25వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా ఆ పార్టీ స్థాపకుడు, అధ్యక్షుడు శరద్ పవార్ వర్కింగ్ప్రెసిడెంట్ల పేర్లు ప్రకటించారు. పవార్ కుమార్తె సుప్రియా సూలే, పార్టీ వైస్ప్రెసిడెంట్ప్రఫుల్పటేల్కు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాను కట్టబెట్టారు. మహారాష్ర్ట, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు, మహిళలు, లోక్ సభ కోఆర్డినేషన్ తదితర వ్యవహారాలను సుప్రియా చూడనున్నారు.
మధ్య ప్రదేశ్, రాజస్థాన్, గోవాలను ప్రఫుల్పటేల్కి అప్పగించారు. గత నెలలో ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని శరద్ పవార్ ప్రకటించారు. కానీ అనుచరులు, పార్టీ నాయకులు, కార్యకర్తల ఒత్తిడితో ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గారు. ఎన్సీపీ ప్యానెల్ కూడా ఆయన రాజీనామాను తిరస్కరించింది. 1999 లో పవార్, పీఏ సంగ్మా ఎన్సీపీని స్థాపించారు.