ఆ బాంబుల ఖర్చు 1.7 కోట్లే!

ఆ బాంబుల ఖర్చు 1.7 కోట్లే!

న్యూఢిల్లీ: జైషే మొహమ్మద్(JEM ) ట్రైనింగ్ సెంటర్, స్థావరాలను నేల కూల్చేందుకు బాంబుల కోసం ఎయిర్ ఫోర్స్ కు అయిన ఖర్చు 1.7 కోట్ల రూపాయలే. పాకిస్థాన్ లోని బాలాకోట్, నియంత్రణ రేఖ( LOC) వెంబడి ఉన్న ముజఫరాబాద్, ఛకోటి ప్రాంతాల్లోని టెర్రరిస్టుల స్థావరాలపై 1000 కిలోల బరువైన లేజర్ గైడెడ్ బాంబు(LGB )లను మిరాజ్–2000 ఫైటర్లు ప్రయోగించాయి. ఒక్కో LGB ఖరీదు 56 లక్షలు. ఈ దాడుల్లో 200 నుంచి 300 మంది టెర్రరిస్టులు హతంమయ్యారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆపరేషన్ కోసం రూ. 6,300 కోట్ల విలువజేసే మెషీన్లను ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దింపింది. రూ. 2,568 కోట్ల విలువజేసే వాయు దళం పాకిస్థా న్ లోకి వెళ్లి వచ్చింది. ఒక్కో మిరాజ్ ఫైటర్ విలువ రూ.214 కోట్లు.

ఈ సమయంలో ఖర్చయ్యే ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టం (ఏడబ్ల్యూఏసీఎస్)ను పాక్ ఎయిర్ ఫోర్స్ పై కన్నేసి ఉంచేందుకు 36 డిగ్రీల కోణంలో తిప్పి ఉంచారు. మిరాజ్ జెట్లకు గాల్లో నే ఇంధనం నింపేందుకు ఐల్యుషిన్ మిడ్ ఎయిర్ రీఫిల్లింగ్ ట్యాంకర్, సర్వైలెన్స్ కోసం హెరాన్ డ్రోన్ వాడారు. ఆపరేషన్ కు వెళ్లిన జెట్లకు ఆపదొస్తే రంగంలోకి దిగేందుకు 3 సుఖోయ్–30 ఎంకే ఐ ఫైటర్లు, 5 మిగ్–29 ఫైటర్లు భారత భూభాగంలో సిద్ధంగా ఉంచారు. ఒక్కో జెట్ 225 కేజీల బరువు(14–14.7 లక్షలు విలువ)న్న LGB ని తీసుకెళ్లి ఉగ్ర స్థా వరాలపై వదిలాయి. బాంబుల టెక్నాలజీని ఇండియా, అమెరికా నుంచి కొనుగోలు చేసింది .