
న్యూఢిల్లీ: ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హెర్నియా చికిత్స కోసం లండన్కు వెళ్లాడు. ‘కుడి వైపు పొత్తి కడుపులో హెర్నియాతో సూర్య కుమార్ బాధపడుతున్నాడు. నిపుణుల వద్ద చికిత్స తీసుకునేందుకు యూకేకు వెళ్లాడు. ఒకవేళ సర్జరీ అవసరమైతే అక్కడే చేయించుకోనున్నాడు. ఐపీఎల్ టైమ్లోనే సూర్య తీవ్రమైన నొప్పితో ఇబ్బందిపడ్డాడు. ఆగస్టు, సెప్టెంబర్లో టీ20 క్రికెట్ మ్యాచ్లు లేకపోవడంతో గాయానికి చికిత్స తీసుకోవడానికి ఇదే సరైన సమయమని సూర్య భావించాడు. ఒకవేళ సర్జరీ జరిగినా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పూర్తిగా కోలుకోవడానికి తగినంత టైమ్ కూడా లభిస్తుంది’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.