తేల్చుకోవాల్సింది అతనే..సూర్య కెరీర్ పై బీసీసీఐ కీలక ప్రకటన

తేల్చుకోవాల్సింది అతనే..సూర్య కెరీర్ పై బీసీసీఐ కీలక ప్రకటన

న్యూ ఢిల్లీ:   టీ20 ప్రపంచకప్-2026లో భారత్‌‌కు టైటిల్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌‌ను ప్రపంచకప్ అనంతరం ప్రకటించిన భారత జట్టులో నుంచి బీసీసీఐ తప్పించింది. అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌‌ను కొత్త టీ20 కెప్టెన్‌‌గా నియమించింది. 2028 టీ20 ప్రపంచకప్‌‌ను దృష్టిలో పెట్టుకుని యువ జట్టును తీర్చిదిద్దే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సూర్యకు జాతీయ జట్టు తలుపులు పూర్తిగా మూసుకుపోలేదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. ముంబై తరఫున నిలకడగా భారీ పరుగులు సాధిస్తే తిరిగి ఎంపికకు అవకాశం ఉంటుందని తెలిపాయి.

ఇటీవలి కాలంలో సూర్య ఫామ్ ఆశించిన స్థాయిలో లేదు. గతేడాది 19 ఇన్నింగ్స్‌‌ల్లో ఒక్క ఆఫ్​ సెంచరీ కూడా కొట్టలేదు.  అనంతరం న్యూజిలాండ్ సిరీస్‌‌లో మూడు ఆఫ్​సెంచరీలతో ఫామ్‌‌లోకి వచ్చినా, ప్రపంచకప్‌‌లో తొలి మ్యాచ్‌‌లో 84 పరుగులు చేసిన తర్వాత మిగిలిన ఎనిమిది ఇన్నింగ్స్‌‌ల్లో కేవలం 158 పరుగులే చేశాడు. ఫైనల్లో డకౌట్ కావడం కూడా ప్రతికూలంగా మారింది. ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ తరఫున 13 ఇన్నింగ్స్‌‌ల్లో 270 పరుగులకే పరిమితం కావడంతో సెలెక్టర్లు యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చారు. సూర్య గైర్హాజరీలో భారత జట్టు వరుస పరాజయాలు చవిచూస్తుండటంతో అతని అనుభవం జట్టుకు ఎంత కీలకమో మరోసారి స్పష్టమవుతోంది.