హాస్పిటల్స్ రూల్స్ పాటిస్తేనే పర్మిషన్ ఇవ్వాలి: కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్

హాస్పిటల్స్ రూల్స్ పాటిస్తేనే పర్మిషన్ ఇవ్వాలి: కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్

సూర్యాపేట, వెలుగు: హాస్పిటల్స్, రోగ నిర్దారణ కేంద్రాలు రూల్స్ పాటిస్తేనే  పర్మిషన్స్ ఇవ్వాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు.  మంగళవారం కలెక్టర్ చాంబర్‌‌లో జరిగిన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ(డిఆర్ఏ)కమిటీ సమావేశంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఎస్పీ కె. నరసింహతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, పీసీపీఎన్డీటీ యాక్ట్  నిబంధనలు పాటిస్తేనే అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. 

అప్లై చేసుకున్న వారంలోపు తాత్కాలిక అనుమతి ఇవ్వాలని, క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేయాలన్నారు.  హాస్పటళ్లలో, రోగ నిర్దారణ కేంద్రాల్లో నిబంధనలు పాటిస్తే శాశ్వతంగా అనుమతి ఇవ్వాలని సూచించారు.  నిబంధనలు పాటించకపోతే నోటీసులు జారీ చేసి తిరస్కరించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతూ..  అర్హత లేని వారు వైద్యం చేసినా లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదనపు కలెక్టర్ కె. సీతారామారావు,  డీఎంహెచ్‌వో  పి. చంద్రశేఖర్, ప్రోగ్రాం అధికారులు జి. చంద్రశేఖర్, నాజియా, కోటిరత్నం, డిప్యూటీ డీఎంహెచ్ఓ జయ మనోహరి, మీడియా అధికారి సంజీవరెడ్డి పాల్గొన్నారు.