ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో బీహార్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ ముమ్మురం చేశారు. ఈ కేసుకు సంబంధించి సుశాంత్ సోదరి, మాజీ ప్రేయసి, వంటమనిషి తదితరులను విచారించిన పోలీసులు రియా చక్రవర్తి కోసం వెతుకుతున్నారు. ఆమె జాడ తెలియడం లేదని అన్నారు. “ ఇన్వేస్టిగేషన్ మొదటి దశలో ఉంది. కోర్టు పరిధిలో ఉంది. రియా చక్రవర్తి ఎక్కడ ఉందో తెలియడం లేదు. ఆమె కోసం వెతుకుతున్నాం” అని బీహార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గుప్తేశ్వర్ పాండ్యా అన్నారు. రియా చక్రవర్తి వేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు ఇంకా తీర్పు చెప్పలేదని అన్నారు. బీహార్ నుంచి నలుగురు పోలీసులు ముంబై వెళ్లీ కీలక ఆధారాలు సేకరించారని అన్నారు. సుశాంత్ బ్యాంక్ అకౌంట్, ట్రాన్జాక్షన్ సమాచారం కూడా బ్యాంక్ నుంచి తీసుకున్నారని డీజీపీ చెప్పారు. సుశాంత్ ఫ్యామిలీకి కచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పారు. సుశాంత్ అకౌంట్ నుంచి రియా చక్రవర్తి 15 కోట్ల రూపాయలు అజ్ఞాత వ్యక్తి అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసింది సుశాంత్ తండ్రి బీహార్లో కంప్లైంట్ ఫైల్ చేశారు. కాగా.. ఇదే కేసుకు సంబంధించి ముంబై పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. దీంతో కేసును బీహార్ నుంచి ముంబైకి తరలించాలని రియా చక్రవర్తి సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే.
