అప్పుల బాధ భరించలేక భార్యభర్తల మృతి

అప్పుల బాధ భరించలేక భార్యభర్తల మృతి

కరీంనగర్ క్రైం, వెలుగు: నమ్ముకున్న కులవృత్తి తిండి పెట్టక, అప్పుల బాధ భరించలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్​జిల్లా అశోక్ నగర్లో నివాసముంటున్న స్వర్ణకారులు గట్టు ముక్కుల సతీశ్,​అతడి భార్య తనూజ బుధవారం ఉదయం ఇంట్లో సైనేడ్ మింగారు. ఉదయం 8 గంటల వరకు భార్యభర్తలిద్దరూ నిద్ర లేవకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి చూడగా అప్పటికే చనిపోయారు.

వారికి మూడేళ్ల కిందట వివాహం జరిగింది. పిల్లలు లేరు. సతీశ్ తండ్రి దక్షిణామూర్తి  పదేళ్ల  కిందట సైనేడ్ మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు పెద్ద కొడుకు, కోడలు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లి కన్నీరు మున్నీరుగా విలపించడం ప్రతి ఒక్కరిని కలచివేసింది.