హుజుర్ నగర్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాన్వాయ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు స్వేరోస్ కార్యకర్తలు. కోదాడ దగ్గర కాన్వాయ్ పై దాడి చేశారు. దీంతో బీజేపీ, స్వేరోస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. సూర్యాపేట బీజేపీ జిల్లా అధ్యక్షుడు భాగ్యరెడ్డి కారుపై దాడి చేశారు. దీంతో కారు అద్దాలు పగలిపోయాయి. పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు స్వేరోస్. రెండ్రోజుల క్రితం ధూళికట్టలో గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్న స్వేరోస్ కార్యక్రమంలో దేవుళ్లను కించపరిచారంటూ వివాదం చెలరేగింది. దీనికి సంబంధించి ప్రవీన్ కుమార్ తీరుపై విమర్శలు చేశారు బండి సంజయ్. ఆయనపై చర్యలకు డిమాండ్ చేశారు. దీనికి నిరసనగానే ఇవాళ స్వేరోస్ కార్యకర్తలు బండి కాన్వాయ్ ను అడ్డుకున్నారు.
బండి సంజయ్ కాన్వాయ్ పై స్వేరోస్ కార్యకర్తల దాడి
- తెలంగాణం
- March 18, 2021
లేటెస్ట్
- మరోసారి చరిత్ర సృష్టిస్తాం.. దేశం షాకయ్యే రిజల్ట్ వస్తది : జగన్
- మోదీ రైతుల సంక్షేమం కోసం ఏం చేయలేదు : శరద్ పవార్
- సీఏఏ అమలు చేసి తీరుతాం..ఇది మోదీ గ్యారంటీ : మోదీ
- ఓరి దుర్మార్గుల్లారా : మెడికల్ షాపుల్లోనే నకిలీ మందులు అమ్ముతున్నారు..!
- ఫ్లోర్ టెస్ట్ జరగాల్సిందే .. ఎల్లారెడ్డి బల్దియా కేసులో హైకోర్టు
- అమిత్ షాను ప్రధానిని చేసేందుకే మోదీ ఓట్లు అడుగుతున్నారు : కేజ్రీవాల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- జగనన్న విద్యా దీవెన.. రూ.502 కోట్లు ఖాతాల్లో జమ
- Devara Fear Song: దేవర దెబ్బకి రజినీ హుకుం సాంగ్ అవుట్.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
- నల్లమల అడవిలో బర్రెలతో సహా యువకుడు మిస్సింగ్
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- త్వరలో స్థానిక ఎన్నికలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!