బండి సంజయ్ కాన్వాయ్ పై స్వేరోస్ కార్యకర్తల దాడి

బండి సంజయ్ కాన్వాయ్ పై స్వేరోస్ కార్యకర్తల  దాడి

హుజుర్ నగర్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాన్వాయ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు స్వేరోస్ కార్యకర్తలు. కోదాడ దగ్గర కాన్వాయ్ పై దాడి చేశారు. దీంతో బీజేపీ, స్వేరోస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. సూర్యాపేట బీజేపీ జిల్లా అధ్యక్షుడు భాగ్యరెడ్డి కారుపై దాడి చేశారు. దీంతో కారు అద్దాలు పగలిపోయాయి. పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు స్వేరోస్. రెండ్రోజుల క్రితం ధూళికట్టలో గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్న స్వేరోస్ కార్యక్రమంలో దేవుళ్లను కించపరిచారంటూ వివాదం చెలరేగింది. దీనికి సంబంధించి ప్రవీన్ కుమార్ తీరుపై విమర్శలు చేశారు బండి సంజయ్. ఆయనపై చర్యలకు డిమాండ్ చేశారు. దీనికి నిరసనగానే ఇవాళ స్వేరోస్ కార్యకర్తలు బండి కాన్వాయ్ ను అడ్డుకున్నారు.