- తైవాన్ 4.95 ట్రిలియన్ డాలర్లు.. మనది 4.92 ట్రిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: తైవాన్ స్టాక్ మార్కెట్సైజ్ ఇండియాను దాటేసింది. ఆ దేశం మార్కెట్ క్యాపిటల్ 4.95 ట్రిలియన్ డాలర్లకు చేరగా, భారత్ మార్కెట్ క్యాపిటల్ 4.92 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. ఏఐ బూమ్తో తైవాన్కు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ మేకర్ టీఎస్ఎమ్సీ షేర్లు ఈ ఏడాది 49 శాతం పెరిగాయి. దీంతో అక్కడి ఇండెక్స్లు దూసుకెళ్తున్నాయి.
తైవాన్ ప్రధాన సూచీలో ఈ ఒక్క కంపెనీ వాటానే 42 శాతం ఉంది. ఇండియా స్టాక్ మార్కెట్ల నుంచి ఫారిన్ ఇన్వెస్టర్లు పెట్టుబడులను భారీగా వెనక్కి తీసుకోవడం, రూపాయి తగ్గుదల, పెట్రో ధరల వల్ల భారత మార్కెట్లు ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్లు ఈ ఏడాది స్టాక్ మార్కెట్ల నుంచి దాదాపు 24 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2.04 లక్షల కోట్లు) ఉపసంహరించి తైవాన్, దక్షిణ కొరియా మార్కెట్లకు మళ్లించారు.
