టైమ్స్ లిస్ట్‌లో ప్రధాని మోడీ.. ప్లేస్ దక్కించుకున్న తాలిబాన్ లీడర్

టైమ్స్ లిస్ట్‌లో ప్రధాని మోడీ.. ప్లేస్ దక్కించుకున్న తాలిబాన్ లీడర్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మరో అరుదైన ఘనతను సాధించారు. ఈ ఏడాదికి గానూ ప్రఖ్యాత టైమ్ మ్యాగజీన్ ప్రకటించిన ప్రపంచంలోని వంద మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో మోడీ చోటు దక్కించుకున్నారు. మోడీతోపాటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సీరం ఇన్‌స్టిట్యూట్ అధినేత అదర్ పూనావల్లా కూడా టైమ్స్ లిస్టులో చోటు దక్కించుకున్నారు. అయితే ఈ లిస్టులో తాలిబాన్ నేత ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ కూడా ప్లేస్ దక్కించుకోవడం గమనార్హం. ఖతర్‌ రాజధాని అయిన దోహాలోని తాలిబన్ల పొలిటికల్ ఆఫీస్‌కు ఘనీ బరాదర్ హెడ్‌గా ఉన్నాడు. తాలిబన్లకు యూఎస్‌కు మధ్య శాంతి ఒప్పందం జరగడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. తాలిబన్‌ సంస్థకు బరాదర్ సహవ్యవస్థాపకుడుగా ఉన్నాడు.