రజనీకాంత్ కు సీఎం సెటైర్

రజనీకాంత్ కు సీఎం సెటైర్

2021 లో తమిళనాడు ప్రజలు మహాద్భుతం చూడబోతున్నారంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ప్రకటనలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి స్పందించారు.  ఆ మహాద్భుతం రాబోయో ఎన్నికల్లో అన్నా డీఎంకే పార్టీ గెలవడమేనని ఆయన అన్నారు.

తమిళనాడు ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం కమల్ హసన్ తో చేయి కలుపుతామన్న వ్యాఖ్యలపై  అన్నాడీఎంకే పార్టీ కూడా మండి పడింది. మరో రెండేళ్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కమల్, రజనీలు కలుస్తామనడం పిల్లి, ఎలుక కలిసినట్లుందని తన అధికారిక పత్రిక ‘నమదు అమ్మ’లో తెలిపింది.

అధ్యాత్మిక భావాలున్న రజనీ, హేతువాదం, కమ్యూనిజం అంశాలపై మాట్లాడుతున్న కమల్ హాసన్ లు కలసి ప్రయాణం చేయడం కష్టమని అభివర్ణించింది.

RELATED NEWS: 

తమిళనాడు ప్రజలు మహాద్భుతం సృష్టించబోతున్నారు: రజనీకాంత్