చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో పూర్తి ఫలితాలు వెలువడ్డాక తమ పార్టీ అన్నా డీఎంకే పరాజయం పాలు కావడం.. డీఎంకే మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను కొద్దిసేపటి క్రితం రాష్ట్ర గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్కు పంపారు. మరోవైపు ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించిన డీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు రేపు చెన్నైలో సమావేశం కానున్నారు. లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎంకే స్టాలిన్ను ఎన్నుకోనేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అనంతరం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ను స్టాలిన్ కలుస్తారు.