తమిళనాడు సీఎం స్టాలిన్ మరో కీలక నిర్ణయం

తమిళనాడు సీఎం స్టాలిన్ మరో కీలక నిర్ణయం

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల కుటుంబాలను ఆదుకోవాలని స్టాలిన్ సర్కార్ నిర్ణయించింది. మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. తమిళనాడులో దాదాపు 3 వేల మంది కరోనా మహమ్మారి బారినపడి చనిపోయారు. వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.