
తమిళనాడులో భారీ వర్షాల కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే చెన్నై జిల్లా కలెక్టరేట్ డిసెంబర్ 2 -3 తేదీల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. భారీ వర్షపాతం, నీటి ఎద్దడి కారణంగా పలు సమస్యలను ఎదుర్కొంటున్న వేలాది మంది పిల్లలకు ఇది ఉపశమనం కలిగించింది.
చెన్నై జిల్లా కలెక్టరేట్ డిసెంబర్ 2-3 తేదీల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ-ఎయిడెడ్ పాఠశాలలకు సెలవు ప్రకటించింది. మైచాంగ్ తుఫాను కారణంగా తమిళనాడులో సముద్రం సాధారణం కంటే ఉధృతంగా ఉంటుందని ఐఎండీ (IMD) తెలిపింది. తమిళనాడుపై తుపాను భయాందోళనలకు లోనవుతున్న నేపథ్యంలో, తీర ప్రాంతాల్లో సముద్రం సాధారణం కంటే ప్రబలంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ డిసెంబర్ 1న హెచ్చరించింది. తుపాను ప్రభావంతో నాగపట్నం జిల్లాలోని వేలంకన్ని బీచ్లో తీరం వెడల్పు పెరిగిన సముద్రం 100 మీటర్లు వెనక్కి వెళ్లింది.
Tamil Nadu | Moderate Thunderstorms and lightning with Moderate rain is very likely at isolated places over Thiruvallur, Kancheepuram, Chengalpattu, Chennai, Tenkasi, Thoothukudi, Thirunelveli and Kanniyakumari districts of Tamilnadu. Light Thunderstorm and lightning with Light… pic.twitter.com/nfXxzri2D2
— ANI (@ANI) December 2, 2023