
అమలాపాల్ ప్రధాన పాత్రలో రత్నకుమార్ రూపొందించిన థ్రిల్లర్ ‘ఆడై’. ఈ చిత్రం తెలుగులోకి ‘ఆమె’గా వచ్చింది. తెలుగులో రిలీజ్ చేసిన తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ‘నలభయ్యేళ్లలో ఎన్నో సినిమాలు చేసిన నేను ‘ఆమె’ చూసి షాకయ్యాను. అసలు ఈ కథని దర్శకుడు ఎలా రాశాడు, ఎందుకు రాశాడు, నిర్మాత ఎలా తీశాడు వంటివన్నీ ఆలోచించాను. ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా ప్యాషన్ ఉండాలి. అమలాపాల్ పెర్ఫార్మెన్స్ షాకింగ్గా ఉంది. ఈ జెనరేషన్లో ఇంత గొప్పగా పెర్ఫార్మ్ చేసిన వాళ్లు తక్కువ. సెకెండాఫ్లో దాదాపు న్యూడ్గానే కనిపిస్తుంది.
ప్రస్తుతం సమాజంలో అమ్మాయిలు ఎలా ఉన్నారన్న దానికి నిదర్శనం ఈ సినిమా. అయితే సరిగ్గా రిలీజ్ రోజున విడుదల ఆగిపోవడం షాక్కి గురిచేసింది. తర్వాత రిలీజైనా కూడా మొదటి రోజు ఐదు షోల కలెక్షన్స్ పోయాయి. నాలాంటి అనుభవం ఉన్న వ్యక్తి ఉండి కూడా సినిమా కిల్ అవ్వడం బాధగా ఉంది. తమిళ నిర్మాతలు ఫ్రాడ్ చేశారు. ఇలాంటి ఫ్రాడ్స్ చాలామంది ఉన్నారు. వారిని పరిశ్రమ నుండి తరిమేయాలి. ఈ సినిమా కోసం అమల చాలా కష్టపడింది. తన రెమ్యునరేషన్ మొత్తం పెట్టడమే కాకుండా తన దగ్గరున్న డబ్బులు కూడా పెట్టి ఈ సినిమాను రిలీజ్ చేయించింది. నిజంగా అలాంటి గొప్ప వ్యక్తిని నేను చూడలేదు’ అన్నారు.