
తంపిరె (ఫిన్లాండ్): ఇండియా టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్ తంపిరె ఓపెన్ టోర్నమెంట్లో ఫైనల్కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్లో ఏడో సీడ్ సుమిత్ 4–6, 6–3, 6–2తో అన్సీడెడ్ స్పెయిన్ ప్లేయర్ డానియెల్ రింకాన్పై మూడు సెట్ల పాటు కష్టపడి విజయం సాధించాడు. దాంతో, చాలెంజర్ లెవెల్ టోర్నీల్లో తన కెరీర్లో ఐదోసారి ఫైనల్ చేరుకున్నాడు. ఏప్రిల్లో రోమ్లో జరిగిన గార్డెన్ ఓపెన్ నెగ్గిన తర్వాత ఈ ఏడాది రెండో ఫైనల్ ఆడబోతున్నాడు. ఫైనల్లో అతను ఐదో సీడ్ డాలిబర్ స్విర్సినాతో అమీతుమీ తేల్చుకోనున్నాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన డాలిబర్ మరో సెమీస్లో 7–6, 6–1తో వరుస సెట్లలో హెన్రి స్వైర్ (జర్మనీ)పై వరుస సెట్లలో గెలిచి ఫైనల్కు వచ్చాడు.