తాండూరు, వెలుగు: వికారాబాద్ జిల్లా తాండూరులో సిమెంట్లోడ్తో వెళ్తున్న డీసీఎం స్కూటీని ఢీకొట్టడంతో ఒక స్టూడెంట్చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తాండూరులోని ఎన్టీఆర్కాలనీకి చెందిన విద్యార్థులు శేఖర్, గోవర్ధన్పెద్దేముల్మండలం గొట్లపల్లి మోడల్స్కూల్లో ఆరు, తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఎన్టీఆర్కాలనీకే చెందిన సాత్విక్(15)వీరిని స్కూటీపై స్కూల్నుంచి ఇంటికి తీసుకువస్తున్నాడు. అంతారం సమీపంలోని బైపాస్ రోడ్డు దగ్గర ఎదురుగా వస్తున్న డీసీఎం వీరి స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాత్విక్అక్కడికక్కడే చనిపోయాడు. శేఖర్, గోవర్ధన్తీవ్రంగా గాయపడ్డారు. వీరిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.
వాకింగ్కు వెళ్లి వస్తుండగా..
అంబర్ పేట్: వాకింగ్ కు వెళ్లి వస్తున్న ఓ వృద్ధుడిని ఓ ప్రైవేట్ కంపెనీ బస్సు ఢీ కొనడంతో చనిపోయాడు. అంబర్పేట్సీఐ టి.కిరణ్ కుమార్ కథనం ప్రకారం..కురుమ బస్తీకి చెందిన బట్టే శ్రీరాములు(82) గురువారం సీపీఎల్గ్రౌండ్ లో వాకింగ్ కు వెళ్లి ఇంటికి వస్తున్నాడు. శ్రీ రమణ చౌరస్తా వద్ద రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన బయోలాజికల్ కంపెనీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీ రాములు తీవ్రంగా గాయపడ్డాడు. గాంధీకి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి..
మాదాపూర్: బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో యువకుడు చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మాదాపూర్పోలీసులు కథనం ప్రకారం..ఏపీలోని అనకాపల్లి జిల్లా బీఎల్ఎన్పురానికి చెందిన పోలవరపు తేజస్(22) కొండాపూర్ బిక్షపతినగర్లోని ఓ హాస్టల్లో ఉంటూ ప్రైవేటు జాబ్చేస్తున్నాడు. బుధవారం రాత్రి రాయల్ఎన్ఫీల్డ్బైక్పై ఫ్రెండ్మోహిత్తో కలిసి హాస్టల్నుంచి మాదాపూర్మెటల్చార్మినార్వైపు వస్తున్నాడు. ఓవర్స్పీడ్లో ఉండడంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టాడు. తేజస్ అక్కడికక్కడే చనిపోగా, మోహిత్కు గాయాలయ్యాయి.
