
హైదరాబాద్, వెలుగు: జ్యూయలరీ బ్రాండ్ ది హౌస్ ఆఫ్ ఎంబీజే సంస్థ, రాజస్థాన్ పోల్కీ, వజ్రాభరణాలను ప్రదర్శించేందుకు "తరాశ్" పేరుతో ఈ నెల 28, 29 తేదీలలో హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో ఎగ్జిబిషన్ను నిర్వహించనున్నట్టు తెలిపింది. రాబోయే వివాహ సీజన్ దృష్టిలో ఉంచుకుని, ప్రతి నగనూ ప్రత్యేకమైన డిజైన్తో, అత్యుత్తమ నైపుణ్యంతో, మాణిక్యాలతో తయారు చేయించామని ఎగ్జిబిషన్ నిర్వాహకులు గౌతమ్ సోని, అభిషేక్ సోని మీడియాకు తెలిపారు. తాము హైదరాబాద్లో గత 13 సంవత్సరాలుగా ప్రదర్శన నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.