ఇయ్యాల్టి (జూన్ 28) నుంచి తరాశ్ జ్యూయలరీ ఎగ్జిబిషన్

ఇయ్యాల్టి (జూన్ 28) నుంచి తరాశ్ జ్యూయలరీ ఎగ్జిబిషన్

హైదరాబాద్, వెలుగు: జ్యూయలరీ బ్రాండ్​ ది హౌస్ ఆఫ్ ఎంబీజే సంస్థ, రాజస్థాన్‌‌‌‌ పోల్కీ, వజ్రాభరణాలను ప్రదర్శించేందుకు "తరాశ్" పేరుతో ఈ నెల 28, 29 తేదీలలో హైదరాబాద్‌‌‌‌లోని పార్క్ హయత్ హోటల్‌‌‌‌లో ఎగ్జిబిషన్​ను నిర్వహించనున్నట్టు తెలిపింది. రాబోయే వివాహ సీజన్  దృష్టిలో ఉంచుకుని, ప్రతి నగనూ ప్రత్యేకమైన డిజైన్‌‌‌‌తో, అత్యుత్తమ నైపుణ్యంతో, మాణిక్యాలతో తయారు చేయించామని ఎగ్జిబిషన్​ నిర్వాహకులు గౌతమ్ సోని,  అభిషేక్ సోని మీడియాకు తెలిపారు. తాము  హైదరాబాద్‌‌‌‌లో గత 13 సంవత్సరాలుగా ప్రదర్శన నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.