రాష్ట్రవ్యాప్తంగా 11వేల జన సంఘ్ సభలు : తరుణ్ చుగ్

రాష్ట్రవ్యాప్తంగా 11వేల జన సంఘ్ సభలు : తరుణ్ చుగ్

రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్ చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో త్వరలోనే జన సంఘ్ సభలు నిర్వహిస్తామని ప్రకటించారు. పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ నేతృత్వంలో ప్రజాగోస బీజేపీ భరోసా నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా 11వేల సభలు నిర్వహించనున్నట్లు చుగ్ చెప్పారు. ప్రతి పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100కు తగ్గకుండా సభలు జరుపుతామని స్పష్టం చేశారు. ఈ మీటింగ్స్ కు కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు హాజరవుతారని అన్నారు. చివరగా హైదరాబాద్ లో ప్రధాని మోడీ అధ్యక్షతన భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నట్లు తరుణ్ చుగ్ చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం బండి సంజయ్ నిరంతరం కృషి చేస్తున్నారని, ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారని ప్రశంసించారు.