
తెలంగాణలోక రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్ ఛార్జ్ తరుణ్ ఛుగ్ కార్యకర్తలకు సూచించారు. కూకట్ పల్లి నియోజకవర్గంలోని బాలాజీ నగర్ డివిజన్ కైతలాపూర్ లో బీజేపీ కార్యవర్గ సభ్యుడు శరణ్ చౌదరి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని.. ఆ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరీష్ రెడ్డి తో కలసి ప్రారంభించారు.
సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పని తీరుపై ప్రజలు విసుగెత్తి మార్పు కోరుకుంటున్నారని విమర్శించారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే ధ్యేయంగా ప్రధాని మోదీ పని చేస్తున్నారన్నారు. అధికారమే లక్ష్యంగా కార్యచరణ సిద్ధం చేసినట్లు చెప్పారు.